న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్లను మోదీ కలవనున్నారు. మేటి వ్యాపారవేత్తలతోనూ ఆయన సంప్రదింపులు జరపనున్నారు. కమలా హారిస్ను కలిసిన రోజే.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపనా్ ప్రధాని యోషిడే సుగాలను కూడా మోదీ కలుసుకునే అవకాశం ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ అంశంపై అధ్యక్షుడు బైడెన్తో మోదీ చర్చించనున్నారు. కోవిడ్19, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ వాణిజ్యం, ఉగ్రవాదం లాంటి అంశాలను కూడా వారు చర్చిస్తారు. సెప్టెంబర్ 23వ తేదీన బైడెన్తో మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రోజు క్వాడ్ సమావేశాల్లో పాల్గొంటారు. 24వ తేదీన యూఎన్ జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తారు.