దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు తెలంగాణకు చెందిన సురాహి (కూజా) జతను ప్రధాని మోదీ బహూకరించారు.
ఆయన భార్యకు నాగాలాండ్ శాలువను అందించారు. బీదర్ బిద్రీ కలశాన్ని ఓ దేశ నేతకు, మధ్యప్రదేశ్ గోండు పెయింటింగ్ను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్కు, డోక్రా ఆర్ట్వర్క్ను గ్రీస్ ప్రధానికి, ఆయన భార్యకు మేఘాలయ శాలువను బహూకరించారు.