న్యూయార్క్ : 271 మంది ప్రయాణీకులతో మియామి నుంచి చిలీ వెళుతున్న విమానంలోని బాత్రూంలో పైలట్ కుప్పకూలడంతో సహ పైలట్లు పనామా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని (Emergency Landing) ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో లాటం ఎయిర్లైన్స్కు చెందిన కమాండర్ ఇవాన్ అనదుర్ మరణించారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అనదుర్కు తీవ్ర గుండెపోటు రావడంతో విమాన బాత్రూంలో కుప్పుకూలాడు.
దీంతో సహ పైలట్లు విమానాన్ని పనామా నగరంలోని టాకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం దిగిన వెంటనే అక్కడున్న ఇద్దరు వైద్యులతో పాటు నర్సు ఇసదుర వైద్య సాయం అందించారు. పైలట్ ప్రాణాలు నిలిపేందుకు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
పనామా ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణీకులను ఖాళీ చేయించి పనామా సిటీ హోటళ్లలో ప్రయాణీకులకు వసతి ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు విమాన సర్వీసును పునరుద్ధరించారు. విమానం ల్యాండయిన అనంతరం వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఇవన్ అనదుర్ను కాపాడలేకపోయారని లాటం గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. బాధిత పైలట్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.
Read More :