న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ‘ప్రముఖులు చేసిన ట్వీట్లను, వైరల్ అయిన ట్వీట్లను, సమాచారపరంగా ముఖ్యమైన ట్వీట్లను థర్డ్ పార్టీ వెబ్ సైట్లు ఉపయోగించుకోవాలంటే డబ్బులు కట్టాలి. ట్విట్టర్ సంస్థ ఉన్నత ఉద్యోగుల జీతాలను తగ్గిస్తాం’.. ట్విట్టర్ కొనుగోలుకు బ్యాంకుల నుంచి అప్పు పుట్టడానికి ఎలాన్ మస్క్ బ్యాంకు అధికారులకు ఇచ్చిన హామీలివి.
ట్విట్టర్ ఆదాయ వనరులను పెంచుతానని మస్క్ పేర్కొన్నారు. మస్క్ హామీలను సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు అధికారులు తెలిపారు.