బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. మొత్తం కేసులు 25 వేలు దాటాయి. బీజింగ్లోనే 500 మందికిపైగా కరోనా సోకింది. దీంతో అక్కడ అధికారులు పాక్షిక లాక్డౌన్ విధించారు. ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చాయోయాంగ్, డోంగ్చెంగ్, జిచెంగ్, టోంగ్జౌ, యాస్కింగ్, చాంగ్పింగ్, షునీ, హైడియన్ జిల్లా ప్రజలను కూడా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అక్కడి అధికారులు కోరారు. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అందరూ విధిగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.