కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్న కారణంగా పానీ పూరీపై నేపాల్ రాజధాని ఖాట్మండులో నిషేధం విధించారు. ఇక్కడి లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట.
దీంతో ఇక్కడ పానీపూరీ అమ్మకాలు నిషేధిస్తున్నట్లు లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ (ఎల్ఎంసీ) అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ప్రజలంతా డయేరియా, కలరా వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.