కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో తీవ్రమైన గ్యాస్ కొరత కారణంగా పౌరులు ప్రమాదకరమైన పద్ధతుల్లో గ్యాస్ను వంటకు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ బెలూన్లలో మిథేన్/ఎల్పీజీ గ్యాస్ను నింపి, దానిని పైపు ద్వారా స్టవ్కు కనెక్ట్ చేసి వంట చేస్తున్నారు. తమకు వేరే ప్రత్యామ్నాయం లేక ఈ మార్గాన్ని అనుసరిస్తున్నామని స్థానికులు తెలిపారు.
గ్యాస్ సరఫరా కొద్దిసేపు పునరుద్ధరించినప్పుడల్లా స్థానికులు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ను నింపుకొని నిల్వ చేసుకుంటున్నారు. తర్వాత ఆ బెలూన్లలోని గ్యాస్ను ఉపయోగించి వంట చేస్తున్నారు. ఇలాంటి గ్యాస్ బెలూన్లు స్థానిక మార్కెట్లలో కూడా 1000 నుంచి 1500 పాకిస్థాన్ కరెన్సీ రూపాయలకు లభిస్తున్నాయి. ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపడం చాలా ప్రమాదకరమైన చర్యగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మొబైల్ బాంబులాంటిదని చెబుతున్నారు.