టోక్యో: కరోనా ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ప్లాస్టిక్ ఉపరితలం, చర్మంపై ఎక్కువ కాలం సజీవంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వేరియంట్ ప్లాస్టిక్పై 8 రోజులకు పైగా, అదేవిధంగా చర్మంపై 21 గంటల పాటు జీవించి ఉంటుందని జపాన్లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకడంతో లభించిన రోగ నిరోధకత డెల్టాతోపాటు ఇతర వేరియంట్లను కూడా సమర్థంగా నిలువరిస్తున్నట్టు మరో అధ్యయనంలో తేలింది
4 కోట్లు దాటిన కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో (మంగళవారం నుంచి బుధవారం నాటికి) దేశవ్యాప్తంగా 2,85,914 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,00,85,116కు పెరిగింది. దేశంలో కరోనా ప్రవేశించి ఈ నెల 30కి రెండేండ్లు పూర్తికానున్నది.
కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఒక్క డోసు రూ.275!
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు త్వరలోనే పూర్తిస్థాయి మార్కెటింగ్ అనుమతులు లభించనున్నాయి. ఈ టీకాల ధరను డోసుకు రూ.250కి పరిమితం చేసే అవకాశం ఉన్నదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనికి అదనంగా రూ.150 సర్వీస్ ఛార్జి ఉంటుందని తెలిపాయి. ప్రస్తుతం దేశంలో ప్రైవేటుగా కొవాగ్జిన్ ఒక డోసు ధర రూ.1,200 కాగా, కొవిషీల్డ్ ధర రూ.780గా ఉంది.