న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృతి ( Omicron affect ) నేపథ్యంలో ప్రపంచ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. మనదేశంలోనూ ప్రధాని మోదీ ఈ ఉదయం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కొవిడ్ కొత్త వేరియంట్ విస్తృతిపై చర్చించారు. తాజాగా నేపాల్ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ విస్తృతిపై సమీక్ష నిర్వహించింది.
ఒమిక్రాన్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో ఆ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. దక్షిణాఫ్రికా నుంచి నేరుగాగానీ, దక్షిణాఫ్రికా మీదుగా గానీ తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల క్వారెంటైన్ను తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని నేపాల్ ఆరోగ్య, జనాభా శాఖ మంత్రి మీడియాకు వెల్లడించారు.