న్యూఢిల్లీ : జీ20 (G20) సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వ సన్నద్ధం కాగా, ఢిల్లీ డిక్లరేషన్ రెడీ అయిందని, నేతలకు డిక్లరేషన్ను అందిస్తామని అధికారులు తెలిపారు. ఢిల్లీ డిక్లరేషన్ అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ దేశాల ముందుంచుతుందని జీ20 భారత్ దూత అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.
జీ20 అధ్యక్ష బాధ్యతను బాలిలో భారత్ చేపట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వృద్ధి, ఉత్పాదకత మందగించిన పరిస్ధితి నెలకొందని గుర్తుచేశారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చాటే వసుధైక కుటుంబం అనే థీమ్తో మన అధ్యక్ష బాధ్యతలు ప్రారంభించాలని భారత్ భావిస్తోందని చెప్పారు. భారత్ జీ20 ప్రెసిడెన్సీలో నిలకడతో కూడిన వృద్ధి, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికలు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.
చర్చల నుంచి మెరుగైన సారాంశాలు, ఫలితాలు రాబట్టడం, పోషకాహార ప్రాధాన్యత గుర్తెరగడం వంటివి జీ20 భారత ప్రెసిడెన్సీలో చేపట్టాల్సిన కార్యక్రమాలని చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులపై కార్యాచరణకు అనుగుణంగా హరిత అభివృద్ధి దిశగా ప్రపంచం పయనించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఈ అంశాలూ తమ ప్రాధాన్యతాంశాల్లో ఉంటాయని తెలిపారు.
Read More :
G20 Dinner | ఢిల్లీని నో ఫ్లైజోన్గా ప్రకటిస్తే జీ20 విందుకు ఎలా వెళతాను : చత్తీస్ఘఢ్ సీఎం