రష్యాతో ఎడతెగని యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు పలు పాశ్చాత్య దేశాలు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరికి అగ్రరాజ్యం అమెరికా పూర్తి సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాధినేతలు ఉక్రెయిన్లో పర్యటించి తమ ఆ దేశానికి తమ మద్దతు తెలిపారు. ఇలాంటి సమయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్కు వెళ్లి మద్దతు తెలుపుతారని వార్తలు వచ్చాయి.
అయితే ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కీవ్లో బైడెన్ పర్యటించబోవడం లేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వెల్లడించారు. యూరోపియన్ యూనియన్కు చెందిన పలువురు కీలక నేతలు కీవ్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ను తమ దేశానికి రావలసిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానించాడు. దీనిపై జెన్ సాకి స్పందిస్తూ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్కు బైడెన్ను పంపే యోచన ఏదీ లేదని స్పష్టం చేసింది.