New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాని (New Zealand PM) క్రిస్టఫర్ లక్సన్ (Christopher Luxon) భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు సరదాగా బ్యాటు పట్టారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ (Ross Taylor)తో కలిసి ఢిల్లీ (Delhi)లో స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను క్రిస్టఫర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా, తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను న్యూజిలాండ్ ప్రధాని కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), క్రిస్టఫర్ లక్సన్ సోమవారం దిల్లీలో విస్తృత స్థాయి చర్చలు కూడా జరిపారు.
Prime Minister of New Zealand Christopher Luxon, during his visit to Delhi, shared pictures of him and former New Zealand international cricketer Ross Taylor playing cricket with children in Delhi. pic.twitter.com/pZc4kD7x5C
— ANI (@ANI) March 19, 2025
Also Read..
ISRO Chairman: సునీతా విలియమ్స్కు వెల్కమ్ చెప్పిన ఇస్రో చైర్మెన్
Tesla Cars | టెస్లా కార్లకు నిప్పు.. ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన మస్క్
IPL 2025: కోల్కతా వర్సెస్ లక్నో మ్యాచ్కు సెక్యూర్టీ సమస్య.. రీషెడ్యూల్ చేసే అవకాశం