ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండుకు 53 కిలోమీటర్ల తూర్పున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2:52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమి లోపల 10 కిలోమీటర్ల లోతున నమోదైందని తెలిపారు.
ఈ భూకంపంవల్ల ఖాట్మండులోని ఆవాస ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ సంభవించలేదు.