Mysterious Light | ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ప్రారంభించి ఏడాది గడిచింది. ఎప్పుడు ఎక్కడ దాడులు జరుగుతాయోనని ఉక్రెనియన్ పౌరులు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆకాశంలో ఒక్కసారిగా భారీ వెలుగులు కనిపించాయి. ఆ తర్వాత ఎయిర్ సెక్యూరిటీ అలెర్ట్ను ఉక్రెయిన్ జారీ చేసింది. కారు చీకట్లో ఒక్కసారిగా వెలుతురు రావడంతో అందరూ భయంతో వణికిపోయారు.
మిస్సైల్ దాడి అని కావొచ్చని ఆందోళనకు గురయ్యారు. అయితే, అది మిస్సైల్ కాదని నాసా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ఉపగ్రహానికి శిథిలాలని కీవ్ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ సెర్గీ వాప్కో తెలిపారు. ఉపగ్రహ భూమిపైకి వచ్చిన సందర్భంలో కాంతి కనిపించిందని పేర్కొన్నారు. 300 కిలోల బరువు ఉన్న పాత ఉపగ్రహం శకలాలు భూమిపైకి వచ్చాయని, మళ్లీ భూమిపై పడే అవకాశం ఉందని నాసా పేర్కొంది.
సోలార్ ఫ్లేర్స్పై అధ్యయనం చేసేందుకు స్పెక్ట్రోస్కోపిక్ ఇమేజర్ ఉపగ్రహాన్ని 2022లో భూమికి తక్కువ ఎత్తులో నాసా ప్రవేశపెట్టింది. 2018 వరకు ఈ ఉపగ్రహం సేవలు అందించింది. ఆ తర్వాత అదుపు తప్పి భూమి కక్షలో తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఉపగ్రహానికి చెందిన శకలాలు సుమారు రాత్రి 10 గంటల సమయంలో కీవ్ గగనతనంలో వచ్చిన సందర్భంలో మండిపోయిన సందర్భంలో ప్రశావంతమైన వెలుతురు కనిపించింది. దీని తర్వాత ఎయిర్ సెక్యూరిటీ అలెర్ట్ను జారీ చేసింది.
Something happened in Kyiv sky tonight. The whole city is at a loss, what it was. UFO? pic.twitter.com/DAic7QHae2
— olexander scherba🇺🇦 (@olex_scherba) April 19, 2023