జెనీవా: గతేడాది మయన్మార్లో జరిగిన ఘర్షణల్లో 1,500 మందికి పైగా పౌరులు హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) మానవ హక్కుల ప్రతినిధి రవీనా షందాసనీ అంచనా వేశారు. చట్టవిరుద్ధంగా కనీసం 11,787 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారని, ఇప్పటికీ 8,792 మంది సైన్యం కస్టడీలోనే మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలో పౌరప్రభుత్వాన్ని కూల్చివేసి అక్కడి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకొన్నది. పౌరనేత అంగ్ సాన్ సూచీకి నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.