ముస్లింలు మెజారిటీ జనాభా ఉన్న దేశం పాకిస్తాన్. అక్కడ హిందువులు మైనారిటీలో ఉన్నారు. పైగా హిందు-ముస్లిం అంశంతో భారత్ నుంచి వేరుపడి ఏర్పాటైన దేశం పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఆ దేవాలయం గురించి వివరాలిలా ఉన్నాయి.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో హింగ్ లాజ్ మాతా మందిర్ అనే దేవాలయం ఉంది. బలూచిస్తాన్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో హింగ్లూ నది తీరాన వెలసిన అమ్మవారి దేవాలయం చాలా మహత్యం కలదని స్థానికులు అంటున్నారు. ఈ దేవాలయం అమ్మవారి శక్తి పీఠాలలో ఒకటని వారు నమ్ముతున్నారు. అక్కడ ముస్లింలు ఈ దేవాలయాన్ని ఒక తీర్థ స్థలంగా భావించి అక్కడ జరిగే పూజలకు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ శక్తి పీఠాన్ని వారు నానీ కా మందిర్ అని పిలుస్తుంటారు. పాకిస్తాన్లో ఈ ఆచారం తరతరాలుగా వస్తోందని అక్కడి ముస్లింలు చెబుతున్నారు.
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్టువు తన సుదర్శన చక్రంతో మాతా సతి శరీరాన్ని 51 భాగాలు చేశారని.. ఆ భాగాలు ప్రపంచంలో పలు ప్రేదేశాలలో ఉన్నాయి. హింగ్ లాజ్ ప్రదేశంలో మాతా సతి చేయి పడడంతో ఈ ప్రదేశంలో కూడా ఒక శక్తి పీఠం ఏర్పాటైందని.. అదే హింగ లాజ్ దేవాలయంగా కొన్ని శతాబ్దాలుగా ప్రాచుర్యం పొందిందని వారి పూర్వీకులు చెప్పారని స్థానికులు అంటున్నారు.