న్యూయార్క్: అమెరికాలో రెండు బస్సులు(Buses Collided) ఢీకొన్న ఘటనలో 75 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో జరిగింది. మన్హటన్లో ఓ డబుల్ డక్కర్ టూర్ బస్సుతో పాటు.. న్యూయార్క్ సిటీ కమ్యూటర్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో డబుల్ డక్కర్కు చెందిన అద్ధాలు పూర్తిగా పగలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. 18 మందికి తీవ్ర గాయాలు కాగా, మరో 63 మందిని మెడికల్ స్టాఫ్ చెకప్ చేసింది.