దుబాయ్: ఇరాన్లో నైతిక(మొరాలిటీ) పోలీసుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా కనుమరుగైన ఈ పోలీసులు తిరిగి వీధుల్లో దర్శనమిచ్చారు. సంప్రదాయలను పాటిస్తున్నారా లేదా పర్యవేక్షించడమే ఈ పోలీసుల పని. ఇస్లామిక్ సంప్రదాయమైన హిజాబ్ను ప్రతి మహిళ తప్పనిసరిగా ధరించాలంటూ ఇరాన్ ఆదివారం ప్రకటించింది.
ఈ మేరకు దేశంలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. హిజాబ్ను ధరించలేదంటూ గత ఏడాది సెప్టెంబర్లో నైతిక పోలీసులు దాడి చేయడంతో 22 ఏండ్ల మహాస ఎమిని మృతి చెందింది.