కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మిస్సైల్ దాడులు చేశామని, ఇక ముందు భీకరంగా క్షిపణి దాడులు ఉంటాయని ఇవాళ రష్యా రక్షణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ఉగ్రవాద దాడులకు పాల్పడుతోందని, దానికి ప్రతీకారంగా కీవ్పై విరుచుకుపడనున్నట్లు రష్యా చెప్పింది. తాజాగా కీవ్ నగర సమీపంలో ఉన్న మిస్సైల్ కంపెనీపై రష్యా తన క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. కీవ్ ప్లాంట్లో ఉన్న దీర్ఘశ్రేణి, మధ్యశ్రేణి మిస్సైల్ వ్యవస్థలతో పాటు యాంటీ షిప్ మిస్సైళ్లు ధ్వంసం అయినట్లు రష్యా తెలిపింది. సరిహద్దు పట్టణాలపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ హెలికాప్టర్లను వాడుతున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.