బెర్లిన్: నైపుణ్యమున్న భారత వర్కర్లకు జర్మనీలో పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆ దేశ కార్మిక శాఖ మంత్రి హ్యూబర్టస్ హెయిల్ తెలిపారు. స్కిల్డ్ వర్కర్లు, ఐటీ నిపుణులు, నర్సులకు జర్మనీలో భారీ డిమాండ్ ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
తమ దేశానికి వచ్చే స్కిల్డ్ వర్కర్ల కోసం వీసా సులభతరం చేస్తున్నట్టు తెలిపారు. భారత్లో జరిగిన జీ20 సమావేశం సందర్భంగా తిరువనంతపురంలో నర్సులను కలిసినట్టు పేర్కొన్నారు. కేరళకు చెందిన నర్సులను నియమించుకున్నట్టు తెలిపారు.