టెహ్రాన్: మిడిల్ ఈస్ట్ (Middle East)లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్కు విమానాల రాకపోకలను లుఫ్తాన్సా రద్దు చేసింది. సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ 1న వైమానిక దాడి జరిగింది. ఇరాన్ టాప్ జనరల్, ఆరుగురు ఇరాన్ సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు.
కాగా, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ బుధవారం హెచ్చరించారు. ఇజ్రాయెల్ను తప్పక శిక్షించాలని అన్నారు. అయితే తమ దేశ రక్షణతోపాటు భద్రతకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అమెరికా నుంచి భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నారు.
మరోవైపు మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇరాన్కు విమానాల నిలిపివేతను పొడిగించినట్లు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ గురువారం ప్రకటించింది. అలాగే మిడిల్ ఈస్ట్కు వెళ్లవద్దని తమ పౌరులకు రష్యా సూచించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనా ప్రాంతాలకు ప్రయాణించవద్దని పేర్కొంది.