మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్ తీరాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో కనీసం 32 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. జనరల్ సంటోస్ నగరంలో కొన్ని భవనాలు కుప్ప కూలిపోగా కీలక మౌలిక సదుపాయాలు దెబ్బ తిన్నాయి. భూకంపం వల్ల సారంగని ప్రావిన్స్లో కొండ చరియలు విరిగి పడటం తో 13 మంది గ్రామస్తులు మృతి చెందారు. పర్వత ప్రాంతంలోని గ్లాన్ పట్టణంలోనూ కొండ చరియలు విరిగి పడ్డాయి. మరోవైపు సమీప తీరాల్లో ఒక అడుగు మేర సునామీ ఏర్పడింది. ఉదయం 7.30కు భూమి బలంగా కంపించిందని.. దాంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని ఆఫీస్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రాంతీయ సంచాలకులు రాడ్ సోస్మెనా తెలిపారు.