ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు దాన్ని కొనేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా యువత దాన్నొక స్టేటస్ సింబల్గా భావిస్తారు. అందుకే దాన్ని కొనేందుకు ఎంతదూరమైనా వెళ్తుంటారు. తాజాగా కేరళకు చెందిన యువకుడు కూడా ఇలాంటి పనే చేశాడు. కొత్తగా విడుదలైన ఐఫోన్ 14 మోడల్ను ముందుగా కొనాలనే ఉత్సాహంతే దుబాయ్ వెళ్లాడు. భారత్లో కన్నా దుబాయ్లో కొన్ని గంటల ముందే ఐఫోన్ను లాంచ్ చేశారు.
అందుకే ధీరజ్ పళ్లియిల్ (28) అనే యువకుడు దుబాయ్ వెళ్లాడు. దీనిలో 512 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ను రూ.1.29 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. దీన్ని భారతీయుల కన్నా కొన్ని గంటల కొనుగోలు చేసేందుకు రూ.40 వేలు ఖర్చు పెట్టి దుబాయ్ వెళ్లాడు. ధీరజ్ ఇలా చేయడం ఇదేకొ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా కొత్తగా విడుదలైన ఐఫోన్ను అందరి కన్నా ముందు కొనేందుకు నాలుగు సార్లు దుబాయ్ వెళ్లాడు. అక్కడ సేల్ ప్రారంభమైన తొలిరోజే మొబైల్ కొనేసేవాడు. ఇలా వరుసగా నాలుగో కొత్త మోడల్ను భారతీయుల కన్నా ఒక రోజు ముందే చేతబట్టాడన్నమాట.