హైదరాబాద్: ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. రాజధాని కీవ్లోని (Kyiv) చాలా ప్రాంతాలపై వైమానిక దళం దాడి చేస్తున్నది. ఈ నేపథ్యంలో కీవ్లో పరిస్థిస్తులు క్షీణిస్తున్నాయని, ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, ఎట్టి పరిస్థిస్తుల్లో రాజధాని కీవ్కు రావద్దని అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం సూచించింది.
‘ఉక్రెయిన్లో ఉన్న భారత పౌరులు ఎక్కడి అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కీవ్ రావద్దు. ఒకవేళ రాజధానికి వస్తున్నవారు సురక్షిత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవాలి. ప్రత్యేకంగా ఉక్రెయిన్కు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లాలి’ అని రాయబార కార్యాలయ అధికారులు సూచించారు.
ఉక్రెయిన్పై దాడి ప్రారంభించిన రష్యా సైన్యం.. క్రమంగా దేశవ్యాప్తంగా బాంబుల వర్షం కురిపిస్తున్నది. రాజధాని కీవ్ సహా ల్వీవ్, ఖార్కివ్, మర్యుపోల్, నిప్రో, లుహాన్స్క్, పోల్టావా, ఇవానో ఫ్రాన్క్విస్క్ నగరాలపై ముప్పేట దాడి చేస్తున్నది. బెలారస్ నుంచి ఉక్రెయిన్ వైపు పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులు తరలివెళ్తున్నాయి.
IMPORTANT ADVISORY TO ALL INDIAN NATIONALS IN UKRAINE AS ON 24 FEBRUARY 2022.@MEAINDIA @PIB @DDNEWS pic.twitter.com/e1i1lMuZ1J
— India in Ukraine (@IndiainUkraine) February 24, 2022
Updated: Map of Russian attacks across Ukraine pic.twitter.com/WB4tg6svxt
— BNO News (@BNONews) February 24, 2022