సుమత్రా: ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రాజధాని సుమత్రాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 11.9 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. సునామీ వచ్చే ప్రమాదం లేదని చెప్పారు.
2021, డిసెంబర్ 14న సుమత్రాలో 7.6 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీచేసింది. 2018లో ఇండోనేషియా సముద్ర తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది 15 లక్షల మందిని ప్రభావితం చేసింది.