King Charles III | ఇంగ్లండ్.. గ్రేట్ బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకున్నా, రాజరిక సంప్రదాయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కొన్ని పద్దతులు ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ బ్రిటన్ పరిధిలోని ఇంగ్లాండ్ కెరెన్సీ నోట్లపై ( Bank of England) ఉన్న ఎలిజబెత్ -2 ముఖచిత్రం చెలామనీ అయిన విషయం తెలిసిందే. 1960 నుంచి ఎలిజబెత్-2 మహారాణి ముఖచిత్రంతో కరెన్సీ నోట్లను ముద్రిస్తూ వస్తున్నారు. అయితే తొలిసారి ఆ నోట్లపై మార్పులు చేశారు. ఆ స్థానంలో బ్రిటన్ మహరాజుగా బాధ్యతలు చేపట్టిన చార్లెస్-3 (King Charles III ) ముఖచిత్రాన్ని ముద్రించారు.
ఈ నోట్లను లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ, చీఫ్ క్యాషియర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా జాన్ పాల్గొని కొత్త నోట్ల నమూనాలను రాజుకు అందజేశారు. 5, 10, 20, 50 పౌండ్ల నమూనాలను రాజుకు అందజేశారు. ఈ కొత్త నోట్లు ఈ ఏడాది జూన్ 5 నుంచే చలామణీలోకి వస్తాయని బ్రిటన్ అధికారులు తెలిపారు.
Also Read..
Woman Lawyer | కస్టమ్స్ అధికారుల పేరుతో మహిళా న్యాయవాదికి బెదిరింపులు.. రూ.10లక్షలు దోపిడీ
Arvind Kejriwal | ఈడీ అరెస్ట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్