ఏడుగురు మృతి
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ పోలీస్ హెడ్క్వార్టర్స్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు రక్షక దళ సిబ్బంది, ముగ్గురు సూసైడ్ బాంబర్లు, ఒక పౌరుడు ఉన్నారు. దాడికి తామే కారణమంటూ పాకిస్థాన్ తాలిబన్ ప్రకటించింది. పోలీస్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకొని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పోలీసులకు, ఉగ్రవాదులకు ఎదురు కాల్పులు జరిగాయి. కాగా, ఇటీవలే పాక్లోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది మరణించారు.