Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. పాక్లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ‘ఇప్పుడే ఓ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఓ కన్నేసి ఉంచాం. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్.. పాక్ పంజాబ్లోని వజీరాబాద్ అల్లావాలాచౌక్లో నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇమ్రాన్ కాలికి తూటా తగిలింది. ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురికి కూడా తూటాలు తగిలాయి. ఇమ్రాన్ను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకొంటున్నారని జియోటీవీ తెలిపింది. ఇమ్రాన్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ను లాహోర్కు తరలిస్తున్నట్టు వెల్లడించాయి.