పారిస్: ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ షట ర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశా రు. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21-9, 21-5 తేడాతో రాచెల్ దరాగ్(ఫ్రాన్స్)పై 21 నిమిషాల్లోనే అలవోకగా గెలిచింది. నాలుగోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా ర్యాంకింగ్స్ పాయింట్లు దక్కించుకొని రేసులోకి రావాలని భావిస్తున్నది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బై దక్కించుకున్న శ్రీకాంత్ తదుపరి పోరులో భారత్కే చెందిన అజయ్ జయరామ్ను 21-15, 21-10తో ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరాడు. హెచ్ఎస్ ప్రణయ్కు కిరణ్ జార్జ్ షాకిచ్చాడు. మిక్స్డబుల్స్లో ఎన్.సిక్కిరెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా ద్వయం విజయం సాధించి ముందడుగేసింది.