కరాచీ : (Journalist killed) బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో పాకిస్తానీ జర్నలిస్ట్ మరణించాడు. దాడిలో మరణించిన జర్నలిస్ట్ షాహిద్ జెహ్రీ మెట్రో 1 న్యూస్లో పనిచేస్తున్నట్లు ఈద్గా స్టేషన్ హౌస్ అధికారి నదీమ్ హైదర్ వెల్లడించారు. ఆదివారం ప్రావిన్స్ హబ్ నుంచి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు తామే కారణమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
రద్దీగా ఉండే రహదారిపై యూ టర్న్ తీసుకున్న వెంటనే జెహ్రీ కారు పేలిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది. దేశీయంగా తయారు చేసిన గ్రనేడ్ దాడిలో జెహ్రీతోపాటు ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కరాచీలోని సివిల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జర్నలిస్ట్ జెహ్రీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మీడియా ఫ్రీడమ్ రిపోర్ట్ 2020 ప్రకారం, ఏడాదిలో కనీసం 10 మంది జర్నలిస్టులు మరణించారని, వందలాది మంది బెదిరింపులు, కిడ్నాప్లను ఎదుర్కొన్నారు.
రిపోర్టర్ జెహ్రీ తమపై నిఘా పెట్టడంతో తామే ఆయనను చంపేందుకు కుట్రపన్నినట్లు బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సోషల్ మీడియా ద్వారా దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటించింది. కాగా, జర్నలిస్ట్ జెహ్రీ హత్యను పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్యూజే) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్ట్ని టార్గెట్ చేసి చంపడాన్ని క్రూరమైన చర్యగా పీఎఫ్యూజే ప్రెసిడెంట్ షాజాదా జుల్ఫికర్ మరియు ప్రధాన కార్యదర్శి నాసిర్ జైదీ వర్ణించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫార్ములాను దొంగిలించిన రష్యా గూఢచారులు : ది సన్ నివేదిక
ప్రాక్టీస్ చేయకుండా 9 వేల మంది లాయర్లపై నిషేధం.. ఎందుకంటే?
వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిందూ మతం మారకండి : మోహన్ భగవత్
ఏడాదిన్నర బాబు.. 100 మంది పోలీసులు.. 65 సీసీటీవీలు.. 45 గ్రామాలు.. చివరకి ఏమైందంటే?
డ్రీమ్11 వ్యవస్థాపకులపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..