earthquake | కొత్త సంవత్సరం వేళ జపాన్ను వరుస భూకంపాలు (Japan earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఏకంగా 155 కంటే ఎక్కువ సార్లు రిక్టరు స్కేలుపై 4 కంటే ఎక్కువ తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. నోటో ద్వీపకల్పంలో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల పెను నష్టమే వాటిల్లింది. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 98కి పెరిగింది. సుమారుగా 450 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఈ ఘటనలో గల్లంతైన 211 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆచూకీ లేకుండా పోయిన వారి జాడ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. సుమారు 4,600 మంది ఈ గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది. ఇక భూకంపం తర్వాత బాధితులను కాపాడేందుకు కీలకమైన 72 గంటలు సైతం గురువారం సాయంత్రంతో ముగిసిపోయింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో బాధితులు ఇళ్ల శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉన్నారు. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Also Read..
Hijacked Ship | హైజాక్ అయిన నౌకలోని సిబ్బందిని ఇలా రక్షించారు.. వీడియో షేర్ చేసిన నేవీ
Prajapalana | నేటితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు..
Formula E race: ఫిబ్రవరి 10న జరగాల్సిన హైదరాబాద్ ఈ-రేస్ రద్దు