న్యూయార్క్ : ఇజ్రాయెల్పై పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడిని (Hamas Attack) ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ రాయబారి ఖండిస్తూ ఈ దాడిని అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఇక్కడ అమెరికాలో మరణించిన 50,000 మంది తరహాలో తామిప్పటికే 1500 మంది ప్రాణాలను కోల్పోయామని ఇజ్రాయెల్ అత్యున్నత దౌత్యవేత్త గిలాద్ ఎర్డాన్ పేర్కొన్నారు.
ఉగ్రసంస్ధ అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండించిన ఎర్డాన్ ఉగ్రవాదులను జంతువులతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, పౌరులను వారి ఇండ్ల నుంచి బయటకు తీసుకువచ్చి బందీలుగా చేశారని, బహిరంగంగా కాల్చివేస్తూ ఊచకోతకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు హమాస్ పూర్తి బాధ్యత వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
తమ పౌరులను, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ దీటుగా ప్రతిస్పందిస్తుందని భద్రతా మండలికి రాసిన లేఖలో ఎర్డాన్ తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్ధ హమాస్ల మధ్య పలు ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగుతున్నాయి.
Read More :