జెరుసలేం : ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సోమవారం కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సలహాదారు తెలిపారు. బెన్నెట్ ఏప్రిల్ 3-5వ తేదీ మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడడంతో భారత పర్యటనపై సందిగ్ధం నెలకొన్నది. పర్యటనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని ఆరోగ్యంగా ఉన్నారని, ఇంటి నుంచి పని చేయడం కొనసాగిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.