గాజా: కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ (Israel) అతిక్రమించిందని హమాస్ (Hamas) ఆరోపించింది. వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సైన్యాలు (Israeli army) జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనియన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas war) మధ్య సుమారు రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఈ నెల 24న విరామం లభించింది. ఇరుపక్షాలు నాలుగు రోజులపాటు కాల్పులు జరపొద్దని ఒప్పందం చేసుకున్నాయి. దీతో శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే రెండు రోజులు గడవకముందే ఇజ్రాయెల్ ఆ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ.. వెస్ట్ బ్యాంక్లోని (West Bank) క్వబాటియా, రమాల్లా, జెనిన్ ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడిందని ప్రకటించింది.
సైనికుల కాల్పుల్లో మరణించిన వారిలో 25 ఏండ్ల డాక్టర్తోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఒక్క జెనిన్లోనే నలుగురు చనిపోయారని చెప్పింది. కాగా, అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 15 వేలకుపైగా పాలస్తీనియనల్లు మృతిచెందగా, 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.