న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి. గురువారం అర్ధరాత్రి పాలస్తీనాలోని గాజా స్ట్రిప్పై (Gaza Strip) ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. లెబనాన్ నుంచి హమాస్ (Hamas) తీవ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులకు పాల్పడంతోనే తాము వైమానిక దాడులు చేసినట్లు తెలిపింది. 2006 తర్వాత గాజాపై ఇంతపెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం ఇదే మొదటిసారి.