రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం 1948 లో సరిగ్గా ఇదే రోజున ఇజ్రాయెల్ ఏర్పాటైంది. ఈ దేశ జనాభా దాదాపు 72.8 లక్షలు. యూదులకు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ప్రదేశం.. ఇజ్రాయెల్. మైనారిటీ మతస్తులు సమారిటన్లు, అరబ్బులు.
ఒట్టోమన్ సామ్రాజ్యం ఒకప్పుడు ఇజ్రాయెల్ స్థానంలో టర్కీకి చెందినది. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని బ్రిటన్ ఆక్రమించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్ రెండు కొత్త శక్తులుగా అవతరించాయి. ఈ యుద్ధంలో బ్రిటన్ చాలా నష్టపోయింది. 1945 లో బ్రిటన్ ఈ ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితికి అప్పగించింది. 1947 లో ఐక్యరాజ్య సమితి ఈ ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించింది. ఒకటి అరబ్ రాష్ట్రం, రెండోది ఇజ్రాయెల్. జెరూసలేం నగరాన్ని అంతర్జాతీయ ప్రభుత్వ నిర్వహణలో ఉంచారు. మరుసటి సంవత్సరం ఇజ్రాయెల్ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నది.
ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం ప్రకటించిన 24 గంటల్లోనే అరబ్ దేశాల ఉమ్మడి దళాలు దాడికి పాల్పడ్డాయి. ఇజ్రాయెల్ ఒంటరిగా ఉన్నా ధైర్యాన్ని కోల్పోలేదు. ఏడాది పాటు పోరు కొనసాగింది. అరబ్ దేశాల సైన్యాలు ఓడిపోయాయి. యుద్ధం ముగియడంతో ఇజ్రాయెల్ 120 మంది సభ్యుల పార్లమెంటుకు మొదటి ఎన్నికలు 1949 జనవరి 25 న జరిగాయి. డేవిడ్ బెన్ గురియన్ దేశపు మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి నాలుగేండ్లకు ఒకసారి పార్లమెంట్కు ఎన్నికలు జరుగుతాయి. మెజార్టీ పార్టీ నేత ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. చాలా మటుకు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలే రాజ్యమేలాయి.
భారతదేశంలోని కేరళ రాష్ట్రం కంటే చిన్నదైన ఈ దేశం ప్రతి విషయంలో ప్రపంచంలోని పెద్ద దేశాల కంటే ముందున్నది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ గురించి అగ్రరాజ్యాలే విస్తుపోతున్నాయి. గత వారం అల్ అక్సా మసీదు వద్ద ప్రారంభమైన అలజడి కాస్తా ఘర్షణలకు దారి తీయడంతో దాదాపు 300 మంది గాయపడ్డారు. జెరూసలెం డే సందర్భంగా మొదలైన ఈ ఘర్షణలు కాస్తా యుద్ధానికి దారితీయడంతో గత మూడు రోజులుగా ఇరు దేశాలు రాకెట్లు, మిస్సైళ్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.
2013: స్వలింగ వివాహాలను గుర్తిస్తున్నట్లు ప్రకటించిన బ్రెజిల్
2010: రక్షణ, అణు విద్యుత్, అంతరిక్షంతో పాటు అనేక రంగాలలో వాణిజ్యం, పెట్టుబడుల కోసం భారతదేశం-రష్యా మధ్య 22 ఒప్పందాలు
1991: నలుగురు యువకులను కిడ్నాప్ చేసిన కేసులో దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా భార్య విన్నీ మండేలాకు 6 సంవత్సరాల జైలు శిక్ష విధింపు
1984 : ఫేస్బుక్ ఆవిష్కర్త మార్క్ జుకర్బెర్గ్ జననం
1981: భారతీయ ఆవిష్కర్త, కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రణవ్ మిస్త్రీ జననం
1981: స్పేస్ వెహికల్ ఎస్ -192 ను ప్రారంభించిన నాసా
1973: మిలిటరీలో మహిళలకు సమాన హక్కులను ఆమోదించిన యూఎస్ సుప్రీంకోర్టు
1973: అమెరికా మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ ప్రారంభం
1955 : యూఎస్-సోవియట్ యూనియన్ మధ్య వార్సా ఒప్పందం
1923: భారతీయ నిర్మాత, దర్శకుడు మృనాల్ సేన్ జననం
1796: స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మొదటి మోతాదును ఇచ్చిన ఎడ్వర్డ్ జెన్నర్
వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్తో చేతులు కలిపిన పీఎస్యూలు
విపత్తులో దోపిడీ అవకాశాన్ని వెతుక్కుంటున్న చైనా
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..