కైరో : ఆఫ్ఘనిస్తాన్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరుకుంది. మరో 70 మంది తీవ్ర గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలను లక్ష్యంగా చేసుకుని కాందహార్లో శుక్రవారం బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడికి బాధ్యులం తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం సంస్థ ప్రకటించింది.
తాలిబన్ల ఆక్రమణల తర్వాత వరుస పేలుళ్లతో ఆఫ్ఘానిస్థాన్ అట్టుడుకుతుంది. గత శుక్రవారమే ఆఫ్ఘానిస్థాన్లోని కుందుజ్ ఫ్రావిన్స్లోని ఓ మసీదులో జరిగిన బాంబు దాడిలో 60 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.