టెహ్రాన్, మార్చి 10: అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మరణించిన తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ స్థానంలో ఇరాన్ నూతన సుప్రీం నాయకుడిగా ఎంపికైన 56 ఏండ్ల మొజ్తబా ఖమేనీ ప్రస్తుత ఘర్షణల్లో గాయపడి ఉండవచ్చని ఇరాన్కు చెందిన మీడియా వార్తలు సూచిస్తున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్పై రమదాన్ యుద్ధాన్ని సాగిస్తున్నామని ఇరాన్ పాలకులు అభివర్ణిస్తుండగా మొజ్తబా ఖమేనీని జాన్బాజ్ ఆఫ్ రమదాన్(గాయపడిన యుద్ధ సైనికుడు)గా ఇరాన్ అధికారిక టీవీ ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీం నాయకుడిగా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వ టీవీ ఆయన యుద్ధంలో గాయపడినట్లు ప్రస్తావించింది.