వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్దేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను టెహ్రాన్ భయపెడుతున్నారని ఆరోపించారు. ఆ దేశ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం, ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇరాన్పై దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది అమెరికా మిలటరీ విజయమని ప్రశంసించారు. ఇరాన్లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయని చెప్పారు. ఇరాన్ శాంతిని నెలకొల్పకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్పై దాడిని చారిత్రక క్షణంగా అభివర్ణించారు.
#WATCH | Amid Iran-Israel conflict, the US strikes Iran’s three nuclear facilities | President Trump says, “Iran, bully of the Middle East, must now make peace. If they do not, future attacks would be far greater and easier. For 40 years, Iran has been saying death to Israel,… pic.twitter.com/4udbZqXbW0
— ANI (@ANI) June 22, 2025
ఇరాన్పై దాడుల తర్వాత ట్రంప్ తొలిసారిగా స్పించారు. వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్పై తాము దాడులు చేశామన్నారు. కీలకమైన అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణమని ప్రకటించారు. తాము చేసిన దాడులు చాలా కష్టతరమని, ప్రపంచంలోని ఏ దేశానికి ఇది సాధ్యం కాదన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను ఇరాన్ భయపెడుతున్నది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందన్నారు. ఇక యుద్ధం కొనసాగకూడదని స్పష్టం చేశారు. ఇరాన్ శాంతి మార్గంలో వెళ్లకపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ లక్ష్యాలు తమకు ఉన్నాయని, తాము తలచుకుంటే అన్నింటినీ నాశనం చేస్తామన్నారు.
#WATCH | US strikes Iran’s three nuclear facilities
US President Donald Trump says, “Our objective was the destruction of Iran’s nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world’s number one state sponsor of terror. Tonight, I can report to the… pic.twitter.com/KQdMgczaJo
— ANI (@ANI) June 22, 2025
అమెరికా, ఇజ్రాయెల్ బృందంగా పనిచేస్తాయన్నారు. ఇరాన్ జనరల్ చేతిలో చాలా మంది బలయ్యారని చెప్పారు. అమెరికా ప్రజలు కూడా చనిపోయారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని, జరగనివ్వనని స్పష్టం చేశారు.
#WATCH | “I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight… Hopefully, we will no longer need their services and this capacity. I hope that so”, says US President Trump after the US strikes Iran’s three nuclear facilities amid the… pic.twitter.com/FVTycpLhgO
— ANI (@ANI) June 22, 2025
ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణు స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. కాగా, అమెరికా దాడులను ఇరాన్ కూడా ధ్రువీకరించింది.