టెహ్రాన్: ఇరాన్లో ఇటీవల భూవివాద కేసులు అధికం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి 10 మందిని కత్తితో పొడిచి ఫార్మ్ కార్మికుల్ని చంపేశాడు. ఓ భూ వివాదం విషయంలో ఈ దాడి జరిగినట్లు ఇరాన్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు ఇరానియన్లు, ఆరుగురు ఆఫ్ఘన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే దాడి చేసిన వ్యక్తికి మానసిక రుగ్మతలు ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇరాన్లో కొన్ని దశాబ్ధాల నుంచి తీవ్ర కరువు ఉంటోంది. నీటి సమస్యలు పెరగడంతో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. నీటికి యాక్సెస్ ఉన్న ప్రాంతాల వద్ద గొడవలు ఎక్కువయ్యాయి.