న్యూఢిల్లీ : సరిహద్దుల్లో ఎప్పుడూ తుపాకులతో ఘర్షణ వాతావరణంలో ఉండే భారతదేశం-పాకిస్తాన్.. మిడతల దండు నుంచి కాపాడుకునేందుకు చేతులు కలిపాయి. రెండు దేశాల్లో మిడతలు దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మిడతలు దాడిచేసే అవకాశాలు లేవు. ఇప్పటివరకు భారతదేశం-పాకిస్తాన్ కలిసి మిడతల కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించడమే కాకుండా, ఆఫ్రికన్ దేశాలు వీరిని చూసి నేర్చుకోవాలని సూచించింది.
ఈ సంవత్సరం భారతదేశంతోపాటు పాకిస్తాన్లో మిడతల దాడి కనిపించదు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి పాకిస్తాన్, భారతదేశానికి వ్యాపిస్తున్న మిడతలు పెద్ద ఎత్తున పంటలను నాశనం చేస్తున్నాయి. దీన్ని నివారించేందుకు రెండు దేశాలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించి మిడతలకు చెందిన కోటికి పైగా గుడ్లను నాశనం చేశారు. దాంతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వృద్ధి నిలిచిపోయింది.
మిడతల దాడులను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) సీనియర్ అధికారి కీత్ క్రెస్మాన్.. భారతదేశం-పాకిస్తాన్ సంయుక్త ఆపరేషన్ను ప్రశంసించారు. గత ఏడాది భారత్, పాకిస్తాన్ 500 మిలియన్లకు పైగా మిడతల దాడిని ఎదుర్కొన్నాయని, అయితే ఈసారి ఈ ఇరుదేశాలు కలిసి మిడతల ఉగ్రవాదాన్ని అడ్డుకున్నాయని ఆయన చెప్పారు.దీని వల్ల రెండు దేశాల్లోని రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని కీత్ క్రెస్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి సంయుక్త ఆపరేషన్ చూసి అరబ్ దేశాలు, ఆఫ్రికన్ దేశాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఆఫ్రికన్ దేశాలు ఇలాంటి ఆపరేషన్ను కొన్నేండ్లపాటు చేపడితే తప్పకుండా ప్రపంచదేశాల నుంచి మిడతలను పారద్రోలవచ్చునని ఆయన పేర్కొన్నారు.
మిడతలను పర్యవేక్షించడానికి భారతదేశం, పాకిస్తాన్ లోకస్ట్ హెచ్చరిక సంస్థను కలిగి ఉన్నాయి. భారతదేశంలో ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. స్వాతంత్ర్యానికి ముందు ఈ రెండూ ఒకటే. విభజన తర్వాత కూడా ఈ విషయంలో ఇద్దరూ ఒకటే అన్నట్లుగా పనిచేస్తున్నారు. ఈ రెండు దేశాలపాటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఐరాస బృందం పర్యవేక్షిస్తున్నది.
పర్యవేక్షణ అంటే డాటాను సేకరించడం, తమలో తాము పంచుకోవడం. తద్వారా మిడతలు ఎక్కడ, ఎంత పెరుగుతున్నాయో అంచనా వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏ ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి? దాడులను నిలువరించేందుకు ఎలాంటి సన్నాహకాలు చేయాలనే కార్యాచరణ రూపొందించేందుకు వీలు చిక్కుతుంది. ఒకేసారి కోట్ల సంఖ్యలో మిడతలు దాడులు చేస్తాయి. ఒక్కరోజులో ఇవి నాశనం చేసే పంటలు 35 లక్షల మందికి సరిపోతాయని ఐరాస అధికారులు అంటున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్నిప్రమాదం.. రోగులు క్షేమం
చరిత్రలో ఈరోజు : లంగూర్ నుంచి మనిషికి తొలి కాలేయ మార్పిడి
కార్లలో ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి గడువు పొడగింపు
టోక్యో ఒలింపిక్స్ ఆడటం లేదు: సెరెనా విలియమ్స్
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..