US-Canada Border | అమెరికా-కెనడా బార్డర్ (US-Canada Border)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దులు దాటేందుకు యత్నించిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయినవారు రొమానియా (Romanian), భారత్ (India)కు చెందిన రెండు కుటుంబాలుగా గుర్తించినట్లు చెప్పారు.
అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు (Akwesasne Mohawk )-క్యూబెక్ (New York State) పరిధిలోని సెయింట్ లారెన్స్ నదిలో (St. Lawrence River) ఈ ఘటన జరిగింది. వీరంతా కెనడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా.. జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. కెనడా-అమెరికా సరిహద్దులోని సెయింట్ లారెన్స్ నదిలోని చిత్తడి ప్రాంతంలో గురువారం వీరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Kalakshetra Foundation: చెన్నై కళాక్షేత్ర ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు
Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ టైమ్లో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్
Stampede | ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట.. 12 మంది దుర్మరణం