ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. పాక్లోని పంజాబ్ (Punjab) ప్రావిన్స్లో ఫ్రీ పిండి పంపిణీ సందర్భంగా 11 మంది మరణించిన ఘటన మరువకముందే కరాచీలో (Ramzan) తొక్కిసలాట (Stampede) జరిగింది. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ క్రమంలో కరాచీలోని (Karachi) ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద (Food distribution centre) తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆహారం పంపిణీ చేస్తుండగా కొందరు వ్యక్తులు అనుకోకుండా కరెంటు తీగపై కాలుపెట్టారు. దీంతో వారికి కరెంటు షాక్ తగిలించింది.
భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీయడంతో తొలక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు అక్కడున్న మురికికాలువలో పడ్డారని చెప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 నుంచి 50 ఏండ్లలోపున్న మహిళలే ఉన్నారని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. రెండు రోజుల క్రితం పంజాబ్ ప్రావిన్స్లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.