ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్యపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, మిలటరీ రెండూ మౌనంగా ఉన్నాయని అక్కడి ప్రతిపక్షం, మీడియా కోడై కూస్తున్న వేళ.. పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు విషయం ఇంతకుముందు ఎటువంటి సమస్య లేదని, ఇప్పుడు కూడా లేదని స్పష్టం చేయాలనుకుంటున్నానని మీడియాకు తెలిపారు. అది ముమ్మాటికీ భారతదేశం అంతర్గత విషయం అని మేం నమ్ముతున్నామన్నారు. అయితే, సెక్షన్ 35 ఏ తొలగింపుపై మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే ముందు ఖురేషి ఈ ప్రకటన చేశారు.
ఐక్యరాజ్య సమితితోపాటు ప్రపంచంలోని ఇతర వేదికలపై ఆర్టికల్ 370 ని తొలగించడాన్ని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా వ్యతిరేకిస్తున్నందున ఖురేషి వ్యాఖ్యలతో పాకిస్తాన్ యూ టర్న్గా పరిగణించవచ్చు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పాకిస్థాన్పై సౌదీ అరేబియా, యూఏఈ ఒత్తిడి పెంచుతున్నాయని పాకిస్తాన్లో వార్తలు వస్తున్నాయి.
ఆర్టికల్ 370 ను తొలగించడం భారతదేశ అంతర్గత విషయమైనప్పటికీ.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా విచారిస్తున్నదని మంత్రి ఖురేషి చెప్పారు. మా ఆందోళన అంతా సెక్షన్ 35 ఏ తో ముడిపడి ఉన్నదన్నారు. మేం 370 తొలగింపునకు ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పిన ఖురేషి.. కశ్మీర్ భౌగోళిక, జనాభా సమతుల్యతను మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
పాకిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
బెంగాల్ స్పీకర్గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
ఆగస్టు నాటికి బ్రిటన్లో కరోనా అంతం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..