న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా దాడి అంశంపై చర్చించేదుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) నిర్ణయించింది. ఉక్రెయిన్పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేకంగా సమావేశం కానుంది.
దీనికి సంబంధించి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్లో 15 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లతో ఆమోదం లభించింది. అయితే ఈ ఓటింగ్కు భారత్, చైనా, యూఏఈలు దూరంగా ఉన్నాయి. కాగా, 1950 తర్వాత సాధారణ అసెంబ్లీలో ఇది 11వ అత్యవసర సమావేశవమగా, గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటిది కావడం విశేషం.