న్యూఢిల్లీ : బెలూన్లు అమ్ముకునే దివ్యాంగుడికి పాకిస్తాన్ మహిళ బిర్యానీ ప్యాకెట్లు అందించిన వీడియో (Viral Video)సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అతడి వద్ద నుంచి కొన్ని బెలూన్లు కూడా కొనుగోలు చేసింది. బాలుడు ఆనందంతో ముఖంపై నవ్వులు చిందించడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఫైజా నయీం ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఏకంగా 1.2 కోట్ల మంది వీక్షించారు.
దివ్యాంగ బాలుడిని క్రిష్గా గుర్తించారు. ఈ వైరల్ వీడియోలో మహిళ తన కారులో నుంచి దివ్యాంగ బెలూన్ల విక్రేతతో మాట్లాడటం కనిపిస్తుంది. ఆపై ఆమె అతడికి బిర్యానీ ప్యాకెట్లు అందించి బాలుడి పేరు వివరాలను ఆరా తీస్తుంది. కొత్త వ్యక్తి నుంచి ఆహారం అందడంతో బాలుడి ముఖం నవ్వులతో వెలిగిపోతుంది.
ఫైజా కౌన్సెలర్, హిప్నాటిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది. బాలుడిని ఫుడ్ తినాలని ఆమె కోరగా అతడు ఇంటికి వెళ్లిన తర్వాత తింటానని చెబుతాడు. అతడి వద్ద ఉన్న బెలూన్లను ఆమె కొనుగోలు చేయడంతో అతడు ఆమె బుగ్గపై నిమిరి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
Read More :
Viral News | ఆడబిడ్డను కన్న కోడలికి పూల తివాచీతో స్వాగతం.. పాప పాదముద్రలు తీసుకొని సంబురాలు