Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల రేంజర్లు అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ పీటీఐ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దాంతో పార్టీ మద్దతుదారులు పలు నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. లాహోర్, పెషావర్, కరాచీ, గిల్గిట్, కరక్, క్వెట్టా సహా పలు నగరాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ మద్దతుదారులు కొందరు రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్ (Pak Army)లోకి చొచ్చుకువెళ్లి దాడికి దిగారు. అలాగే లాహోర్లోరి కార్ప్స్ కమాండర్ నివాసంలోకి ప్రవేశించి, ఇంటిని ధ్వంసం చేశారు. పెషావర్లో 30 రోజుల పాటు 144 సెక్షన్ను విధిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ షా ఫహద్ తెలిపారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
#RadioPakistan's building set on fire in #Pakistan as chaos erupts after arrest of #ImranKhan. #ImranKhanArrest pic.twitter.com/ryaFo2CdWd
— Vishal Sehgal (@VishalSehgal4U) May 9, 2023
మరో వైపు పంజాబ్ ప్రావిన్స్లోనూ 144 సెక్షన్ విధించారు. దాంతో పాటు ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. పాకిస్థాన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. అలాగే ప్రభుత్వానికి చెందిన ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ అరెస్టుపై ఇస్లామాబాద్ కోర్టు ప్రభుత్వంపై మండిపడింది. పోలీసు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది. అరెస్టుపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇమ్రాన్ అరెస్టు అక్రమమని పీఐటీ తరఫున లాయర్లు వాదించారు. విచారణకు సహరించకపోవడంతోనే అరెస్టు చేసినట్లు ప్రభుత్వ లాయర్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసి తీర్పు రిజర్వ్ చేసింది. అయితే, ఇమ్రాన్ను అల్ ఖదీర్ ట్రస్టు అవినీతి కేసులో అరెస్టు చేసినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. ఇమ్రాన్ను హింసించినట్లుగా వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. మాజీ ప్రధానితో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరిగిందని పేర్కొంది.
زندہ دلان لاہور 🔥#نکلو_خان_کی_زندگی_بچاؤ pic.twitter.com/Ekh2lGGOyn
— Mudasir Rehman (@IMudasirKhan) May 9, 2023
PTI workers entered in GHQ Rawalpindi #ptiprotest@ISI_GHQ pic.twitter.com/KfcarTvdn6
— انجینئر نورخان (@realnoorkhan_1) May 9, 2023
మరో వైపు ఇమ్రాన్ను పోలీసులు కాకుండా రేంజర్లు అరెస్టు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంలో సైన్యం జోక్యాన్ని కొట్టిపారేయలేమని, ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు ఐఎస్ఐ, సైన్యం సంయుక్తంగా ప్రణాళిక వేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధానిని కోర్టు నుంచి కిడ్నాప్ చేసినట్లుగా పీటీఐ అధికారిక ప్రతినిధి ఫవాద్ చౌదరి ఆరోపించారు. న్యాయవాదులు, సాధారణ ప్రజలను హింసించారన్నారు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానానికి ముందే ఇమ్రాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై ఉగ్రవాదం, హత్య, హింస తదితర ఆరోపణలపై 140 కేసులు నమోదయ్యాయని, ఈ కేసులన్నింటిలో అధికార పార్టీ రాజకీయ కారణాలతో ఇమ్రాన్ను బలి పశువుగా చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. సమీప భవిష్యత్లో ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే ప్రస్తుత అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని, దాంతో ఎన్నికలకు ముందే ఇమ్రాన్ను అరెస్టు చేసినట్లుగా ఆరోపణలున్నాయి.