అబు ధాబి: పర్యావరణ పరిరక్షణకు అవిరళ కృషి చేసిన వ్యక్తులకు పదేండ్ల బ్లూ రెసిడెన్సీ వీసాను మంజూరు చేయనున్నట్లు యూఏఈ ప్రకటించింది. దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఈ నెల 15న ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘మన ఆర్థిక వ్యవస్థ పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉంది.
ఈ విషయంలో మన పయనం స్పష్టంగా, స్థిరంగా ఉంది’ అని ఆయన అన్నారు. సముద్ర జంతుజాలాలు, భూమిపై ఉండే జీవావరణ వ్యవస్థలు, వాయు నాణ్యత, సుస్థిత సాంకేతికత తదితర రంగాల్లో కృషి చేసిన వారికి ఈ వీసాలు మంజూరు చేస్తారు. వీటిని పొందడానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ(ఐసీపీ) అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు.