Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది (Khalistani Terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau ) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్-కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో రెండు దేశాలకు మిత్రదేశమైన అమెరికా (America) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తులో కెనడాకు సహకారం అందించాలని భారత్కు సూచించింది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
అమెరికాకు.. భారత్-కెనడా రెండూ మిత్ర దేశాలన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెలకొన్న వివాదం నేపథ్యంలో ఒకవేళ కెనడా, భారత్లో ఏదో ఒక దేశం వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమెరికా ఎవరి పక్షాన ఉంటుంది..? అన్న ప్రశ్న తలెత్తింది. దీనికి అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి (Ex Pentagon Official) మైఖేల్ రూబిన్ (Michael Rubin) ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. అగ్రరాజ్యం రెండు మిత్ర దేశాల్లో భారత్నే ఎంపిక చేసుకుంటుందన్నారు. ‘రెండు మిత్రదేశాల విషయంలో అమెరికా ఒకరికి మద్దతుగా నిలుస్తుందని నేను అనుకోవడం లేదు. ఒక వేళ అలాంటి పరిస్థితి తలెత్తితే.. ప్రస్తుతం నెలకొన్న వివాదంలో అమెరికా మొగ్గు భారత్ వైపే ఉంటుంది. ఎందుకంటే నిజ్జర్ ఓ ఉగ్రవాది. వ్యూహాత్మకంగా అమెరికాకు కెనడా కంటే భారత్ ఎంతో ముఖ్యమైనది. చైనాను ఎదుర్కొనే విషయంలో భారత్తో మా బంధం చాలా ముఖ్యమైనది. ఇక కెనడా ప్రధాని పదవిలో జస్టిన్ ట్రూడో దీర్ఘకాలం కొనసాగపోవచ్చు. కొత్తగా వచ్చే ప్రధానితో అమెరికా తిరిగి బంధం బలోపేతం చేసుకోగలదు’ అని వ్యాఖ్యానించారు.
ఇక భారత్ విషయంలో ప్రధాని ట్రూడో చాలా పెద్ద తప్పు చేశాడని తాను భావిస్తున్నట్లు మైఖేల్ చెప్పారు. ‘ప్రధాని ట్రూడో చాలా పెద్ద తప్పు చేశారని నేను భావిస్తున్నాను. వెనకడుగు వేయడానికి అవకాశం లేని రీతిలో భారత్పై ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించుకోలేకపోతే, ఉగ్రవాదికి ఈ ప్రభుత్వం ఎందుకు ఆశ్రయమిచ్చిందో ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. భారత్తో పోరుకు కెనడా మొగ్గు చూపడమంటే.. ఏనుగుపై చీమ యుద్ధం ప్రకటించడమే అవుతుంది. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనేది వాస్తవం’ అని మైఖేల్ రూబిన్ పేర్కొన్నారు.
Also Read..
Justin Trudeau | ఆ విశ్వసనీయ సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్కు వెల్లడించాం : ట్రూడో
Rat Bitese | 6 నెలల పసికందుపై ఎలుకల గుంపు దాడి.. ఎముకలు బయటకు వచ్చేలా కొరికి తినేసిన వైనం
Heavy Rains | రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన నాగ్పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు