Murder | హైదరాబాద్ : లండన్లో హైదరాబాద్ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రైసుద్దీన్ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపేశారు. హత్య చేశాక నగదు, వస్తువులను దుండగులు దోచుకెళ్లారు.
కుమార్తె పెళ్లి కోసం హైదరాబాద్కు వచ్చే సమయంలో రైసుద్దీన్ హత్యకు గురయ్యాడు. అక్టోబర్ 5వ తేదీన కుమార్తె పెళ్లి ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. రైసుద్దీన్ హత్యకు గురైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం త్వరగా హైదరాబాద్కు వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.